నిర్ణయసింధు ధర్మగ్రంధము ప్రకారము చైత్రశుద్ధ పాడ్యమియే సంవత్సరాది.
ఉగాది అని సంవత్సరాదికి ఒక వివరణ ఇలా ఉంటుంది. ఉత్తరాయణమూ, దక్షిణాయనమూ అని సంవత్సరాన్ని రెండు సమభాగాలుగా విభజించవచ్చును. ఉత్తరాయణం రాశిచక్రంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించటంతో మొదలై సూర్యుడి కర్కాటకరాశిప్రవేశంతో ముగుస్తుంది. దక్షిణాయనం రాశిచక్రంలో సూర్యుడు కర్కాటక ప్రవేశించటంతో మొదలై సూర్యుడి మకరరాశిప్రవేశంతో ముగుస్తుంది. ఈ రెండు ఆయనాల యుగమూ కలది కాబట్టి సంవత్సరానికి యుగమని పేరు. అందుచేత సంవత్సరారంభానికి యుగాది అని పేరు వచ్చింది. కాని ఈ వాదం మనకు అంత సమంజసంగా తోచదు. ఉగాదినాడు ఉత్తరాయణము కాని దక్షిణాయనము కాని ప్రారంభం కాదు కదా.
ఉగస్య ఆది:ఉగాది అని ఒక వాదం ప్రకారం సృష్ట్యాదిలో సమస్త గ్రహములు రాశిచక్రమునగల అశ్వినీ నక్షత్రమునుండి బయలు దేరినవి. నాటి నుండి కాలము సంవత్సరప్రమాణములచేత గణించబడుఉన్నది. కాని ఇదికూడ అంత సమంజసమైన వాదం కాకపోవచ్చును. మరి కొందరు సృష్ట్యాది కాక క్రీ.పూ 3102లో శ్రీకృష్ణావతారసమాప్తి జరిగిన నాటినుండే కలియుగం ఆరంభమైనదనీ ఆనాడు సమస్త గ్రహములు రాశిచక్రమునగల అశ్వినీ నక్షత్రముననుండినవనీ నూతన యుగాది యే ఉగాదిగా స్థిరపడినదనీ చెబుతారు. దీనిలో కలియుగారంభం లెక్కవేయటం వరకు సరియేగాని నాడు గ్రహములు మేషాదియందు గలవా యన్నది విచార్యము.
ఉగాదినాడే శాలివాహనుడు అప్పటికి శకకర్తగా వెలుగొందుచున్న విక్రమార్కుని జయించి పట్టాభిషిక్తుడై నూతనశక కర్త మైనట్లుగా కఢ యున్నది. ఇది నిజము కావచ్చును. శకారంభమును యుగారంభముగా యగాది లేదా ఉగాది అని పేరు వచ్చి యుండ వచ్చును.
ఉగాదినాడు మత్సావతారమున శ్రీమహావిష్ణువు సోమకుని సంహరించి వేదోధ్ధరణము చేసెనని ఒక ఐతిహ్యము.
మనకు ఉగాదితో సంవత్సరారంభం అని నిర్ణయించిన వాడు వరాహమిహిరుడని ఒక వివరణ ఉన్నది. వరాహమిహిరాచార్యుని పంచసిధ్ధాంతిక అహర్గణనిర్ణయాన్ని శకసంవత్సరం 427 చైత్రశుధ్ధపాడ్యమినుండి చేస్తుంది. కాబట్టి యీ వాదం సమంజసంగా తోస్తున్నది.
పాఠకులందరకూ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది అని సంవత్సరాదికి ఒక వివరణ ఇలా ఉంటుంది. ఉత్తరాయణమూ, దక్షిణాయనమూ అని సంవత్సరాన్ని రెండు సమభాగాలుగా విభజించవచ్చును. ఉత్తరాయణం రాశిచక్రంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించటంతో మొదలై సూర్యుడి కర్కాటకరాశిప్రవేశంతో ముగుస్తుంది. దక్షిణాయనం రాశిచక్రంలో సూర్యుడు కర్కాటక ప్రవేశించటంతో మొదలై సూర్యుడి మకరరాశిప్రవేశంతో ముగుస్తుంది. ఈ రెండు ఆయనాల యుగమూ కలది కాబట్టి సంవత్సరానికి యుగమని పేరు. అందుచేత సంవత్సరారంభానికి యుగాది అని పేరు వచ్చింది. కాని ఈ వాదం మనకు అంత సమంజసంగా తోచదు. ఉగాదినాడు ఉత్తరాయణము కాని దక్షిణాయనము కాని ప్రారంభం కాదు కదా.
ఉగస్య ఆది:ఉగాది అని ఒక వాదం ప్రకారం సృష్ట్యాదిలో సమస్త గ్రహములు రాశిచక్రమునగల అశ్వినీ నక్షత్రమునుండి బయలు దేరినవి. నాటి నుండి కాలము సంవత్సరప్రమాణములచేత గణించబడుఉన్నది. కాని ఇదికూడ అంత సమంజసమైన వాదం కాకపోవచ్చును. మరి కొందరు సృష్ట్యాది కాక క్రీ.పూ 3102లో శ్రీకృష్ణావతారసమాప్తి జరిగిన నాటినుండే కలియుగం ఆరంభమైనదనీ ఆనాడు సమస్త గ్రహములు రాశిచక్రమునగల అశ్వినీ నక్షత్రముననుండినవనీ నూతన యుగాది యే ఉగాదిగా స్థిరపడినదనీ చెబుతారు. దీనిలో కలియుగారంభం లెక్కవేయటం వరకు సరియేగాని నాడు గ్రహములు మేషాదియందు గలవా యన్నది విచార్యము.
ఉగాదినాడే శాలివాహనుడు అప్పటికి శకకర్తగా వెలుగొందుచున్న విక్రమార్కుని జయించి పట్టాభిషిక్తుడై నూతనశక కర్త మైనట్లుగా కఢ యున్నది. ఇది నిజము కావచ్చును. శకారంభమును యుగారంభముగా యగాది లేదా ఉగాది అని పేరు వచ్చి యుండ వచ్చును.
ఉగాదినాడు మత్సావతారమున శ్రీమహావిష్ణువు సోమకుని సంహరించి వేదోధ్ధరణము చేసెనని ఒక ఐతిహ్యము.
మనకు ఉగాదితో సంవత్సరారంభం అని నిర్ణయించిన వాడు వరాహమిహిరుడని ఒక వివరణ ఉన్నది. వరాహమిహిరాచార్యుని పంచసిధ్ధాంతిక అహర్గణనిర్ణయాన్ని శకసంవత్సరం 427 చైత్రశుధ్ధపాడ్యమినుండి చేస్తుంది. కాబట్టి యీ వాదం సమంజసంగా తోస్తున్నది.
పాఠకులందరకూ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
మీకూ,మీ కుటుంబానికి కూడా నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!
ReplyDelete