మనం ముందు టపాలో కటపయాది సూత్రం గురించి తెలుసుకున్నాం.
ఈ సూత్రాన్ని ఉపయోగించి సంఖ్యలను మాటలుగా మార్చి లిఖించి గుర్తు పెట్టుకుందుకు సులభంగా చేసే వారని తెలుసుకున్నాం.
ఇలా కటపయాది సూత్రాన్ని ఉపయోగించి పదాలుగా మార్చటం వలన మరొక సౌకర్యం కూడా ఉంది.
జ్యోతిశ్శాస్త్రంలో గణితసంబంధమైన విషయాలు ప్రస్తావించవలసి వచ్చినప్పుడు యీ కటపయాది సూత్రం చాలా బాగా ఉపకరిస్తుంది.
ఒక శ్లోకంలో 'మాతలి' అనే మాటతో ఒక సంఖ్యను సూచించారనుకోండి. ఈ సూత్రం ద్వారా అది 365 అని తెలుసుకుంటాం. అయితే 365 అనటానికి గ్రంధకర్తగారు వేరే మాటా మాశుగ అని అర్థంలేని మాటా వాడవచ్చు దాని బదులు. యేది వాడాలన్నది ఆయన యిష్టం!
అయితే, కటపయాది సూత్రం ఒకటే కాక మరొక అందమైన పధ్దతి కూడా మన వాళ్ళు కనుగొని వాడారు.
ఏ మాటలు యే సంఖ్యలతో ముడిపడి ప్రసిద్ధి కెక్కాయో ఆ మాటలను ఆ సంఖ్య లేదా అంకె కొరకు వాడటం కూడా చాలా విరివిగా చేసారు.
ఉదాహరణకు 'బాణ' అనే మాటతో 5 అంకెను సూచిస్తారు. ఎందుకంటే మన్మధుడు పంచబాణుడని జగత్ప్రసిధ్ధి గదా.
అలాగే 'మను' అన్నమాటతో 14 అనే సంఖ్య సూచించటం పరిపాటి. మనువులు 14 మంది అని తెలుసును కదా.
ఇలా యేయే మాటలతో యేమేమి అంకెలూ, సంఖ్యలూ సూచిస్తారో ఒక చిన్న పట్టీ యిస్తున్నాను చూడండి.
ఇలా యే సంఖ్య లేదా అంకె కావాలో దానికి తగిన పదాన్ని యెన్నుకుని వాడటమే. పెద్దపెద్ద సంఖ్యలను చెప్పటానికి ఒకటి కంటె హెచ్చు పదాలను సమాసంచేసి వాడతారు. దానికేమీ అర్థం ఉండదు - ఇష్ట సంఖ్యను చెప్పటం తప్ప.
ఉదాహరణకు వరాహమిహిరుడు ఒక చోట 'ఏకర్తుమను' అన్న మాట వాడతాడొక శ్లోకంలో . అంటే ఏక - ఋతు - మను అన్నమాట
అనగా 1 - 6 - 14 . అంకానాం వామతో గతిః కదా. కాబట్టి ఏకర్తుమను అంటే 1461 అన్నమాట.
జ్యోతిశ్శాస్త్రం అయినా, వ్యాకరణశాస్త్రం అయినా మరేదో శాస్త్రం అయినా మనవాళ్ళు తమతమ గ్రంధాల్లో శ్లోకాల్లోనే విషయాన్ని చెప్పేవారు కదా. శ్లోకాల్లో సంఖ్యలను ఇరికించాలంటే కటపయాది సూత్రమూ, యీ సంఖ్యా వాచకాల వాడకమూ భలే ఉపయోగిస్తాయి.
వివరణాత్మక విషయాలు గద్యంలో ఉన్నా, ప్రధానమయిన ఉటంకింపులు శ్లోకాల్లోనే చెప్పటం గొప్ప రివాజు. దీని వలన రెండు లాభాలున్నాయి.
ఒకటి, శ్లోకాలను కంఠగతంగా చేసుకొని గుర్తు పెట్టుకోవటం అనేది వచనాలను గుర్తు పెట్టుకోవటం కన్నా బాగా సులువు. శ్లోకాలలోని సౌష్ఠవపూరిత నిర్మాణం, చక్కటి ధార, వాటి అందమైన నడకల కారణంగా సులువుగా గుర్తుంటాయవి.
రెండవది, పూర్వకాలంలో కావ్య పఠనం సాధారణంగా అందరూ చేసేదే. కావ్యానికి గల ఆదరాన్ని సాధించకుండా యెంత గొప్ప విషయం గల గ్రంధమైనా ఆమోదం పొందటం కష్టంగా ఉంటుంది. పైగా యేశాస్త్రకారుడైనప్పటికీ స్వయంగా భాషాధ్యయనం చేసినవాడూ, కాస్తో కూస్తో మంచి కవిత్వం చెప్పగలవాడూ అయి ఉండటం సహజం. కాబట్టి తమ శాస్త్రవిషయాన్ని వీలయినంత అందమైన కవిత్వంగా చెప్పటం కూడా అవసరమే. ఇది కూడా గ్రంధానికి ప్రసిధ్ధి తేగలదు. అలాగని అన్ని శాస్త్రగ్రంధాలూ మంచి కవిత్వం చెప్పలేదనుకోండి. అది వేరే విషయం.
ఈ సూత్రాన్ని ఉపయోగించి సంఖ్యలను మాటలుగా మార్చి లిఖించి గుర్తు పెట్టుకుందుకు సులభంగా చేసే వారని తెలుసుకున్నాం.
ఇలా కటపయాది సూత్రాన్ని ఉపయోగించి పదాలుగా మార్చటం వలన మరొక సౌకర్యం కూడా ఉంది.
జ్యోతిశ్శాస్త్రంలో గణితసంబంధమైన విషయాలు ప్రస్తావించవలసి వచ్చినప్పుడు యీ కటపయాది సూత్రం చాలా బాగా ఉపకరిస్తుంది.
ఒక శ్లోకంలో 'మాతలి' అనే మాటతో ఒక సంఖ్యను సూచించారనుకోండి. ఈ సూత్రం ద్వారా అది 365 అని తెలుసుకుంటాం. అయితే 365 అనటానికి గ్రంధకర్తగారు వేరే మాటా మాశుగ అని అర్థంలేని మాటా వాడవచ్చు దాని బదులు. యేది వాడాలన్నది ఆయన యిష్టం!
అయితే, కటపయాది సూత్రం ఒకటే కాక మరొక అందమైన పధ్దతి కూడా మన వాళ్ళు కనుగొని వాడారు.
ఏ మాటలు యే సంఖ్యలతో ముడిపడి ప్రసిద్ధి కెక్కాయో ఆ మాటలను ఆ సంఖ్య లేదా అంకె కొరకు వాడటం కూడా చాలా విరివిగా చేసారు.
ఉదాహరణకు 'బాణ' అనే మాటతో 5 అంకెను సూచిస్తారు. ఎందుకంటే మన్మధుడు పంచబాణుడని జగత్ప్రసిధ్ధి గదా.
అలాగే 'మను' అన్నమాటతో 14 అనే సంఖ్య సూచించటం పరిపాటి. మనువులు 14 మంది అని తెలుసును కదా.
ఇలా యేయే మాటలతో యేమేమి అంకెలూ, సంఖ్యలూ సూచిస్తారో ఒక చిన్న పట్టీ యిస్తున్నాను చూడండి.
సున్న ఆకాశం పూర్ణం, రంధ్రం, అనంతం
ఒకటి భూమి. చంద్రుడు
రెండు అశ్వినీదేవతలు, కర్ణాలు, కవలలు వగైరా రెండిటిని తెలిపేవి.
మూడు అగ్నులు (ఇవి మూడని ప్రతీతి), గుణాలు, త్రినేత్ర, పుర (త్రిపురాలు అని గదా) వగైరా
నాలుగు వేద, ఆశ్రమ, యుగ, సాగర, కేంద్ర వగైరా నాలుగింటిని తెలిపే మాటలు
అయిదు ప్రాణ, పాండవ, భూతాలను తెలిపే మాటలు వగైరా.
ఆరు అరి, ఋతు, శాస్త్ర, దర్శన వగైరా ఆరింటిని తెలిపే మాటలు
యేడు ఋషి, ధాతు, వ్యసన, స్వర, గిరి వగైరా యేడింటిని తెలిపే మాటలు
యెనిమిది వసువులు, దిగ్గజాలు, దిక్పాలకులు, మంగళాలు, సిధ్ధులు వగైరాలను తెలిపే మాటలు
తొమ్మిది నిధులు, నందులు, గ్రహాలు వగైరాలను తెలిపే మాటలు
పది దిశలు, అంగుళులు (వ్రేళ్ళు), అవతారాలు, కర్మలు వగైరాలను తెలిపే మాటలు
పదకొండు రుద్రుడు వగైరా శివ నామాలు
పన్నెండు ఆదిత్యాది సూర్యనామాలు,
పదమూడు విశ్వేదేవులు
పదునాలుగు మనువులు
పదిహేను తిథి, పక్ష వగైరా పదిహేనును తెలిపే మాటలు
పదహారు కళలు, రాజును తెలిపే మాటలు
పధ్దెనిమిది ధృతి
పందొమ్మిది అతిధృతి
ఇరవై నఖముల(గోళ్ళ)ను తెలిపే మాటలు
ఇలా యే సంఖ్య లేదా అంకె కావాలో దానికి తగిన పదాన్ని యెన్నుకుని వాడటమే. పెద్దపెద్ద సంఖ్యలను చెప్పటానికి ఒకటి కంటె హెచ్చు పదాలను సమాసంచేసి వాడతారు. దానికేమీ అర్థం ఉండదు - ఇష్ట సంఖ్యను చెప్పటం తప్ప.
ఉదాహరణకు వరాహమిహిరుడు ఒక చోట 'ఏకర్తుమను' అన్న మాట వాడతాడొక శ్లోకంలో . అంటే ఏక - ఋతు - మను అన్నమాట
అనగా 1 - 6 - 14 . అంకానాం వామతో గతిః కదా. కాబట్టి ఏకర్తుమను అంటే 1461 అన్నమాట.
జ్యోతిశ్శాస్త్రం అయినా, వ్యాకరణశాస్త్రం అయినా మరేదో శాస్త్రం అయినా మనవాళ్ళు తమతమ గ్రంధాల్లో శ్లోకాల్లోనే విషయాన్ని చెప్పేవారు కదా. శ్లోకాల్లో సంఖ్యలను ఇరికించాలంటే కటపయాది సూత్రమూ, యీ సంఖ్యా వాచకాల వాడకమూ భలే ఉపయోగిస్తాయి.
వివరణాత్మక విషయాలు గద్యంలో ఉన్నా, ప్రధానమయిన ఉటంకింపులు శ్లోకాల్లోనే చెప్పటం గొప్ప రివాజు. దీని వలన రెండు లాభాలున్నాయి.
ఒకటి, శ్లోకాలను కంఠగతంగా చేసుకొని గుర్తు పెట్టుకోవటం అనేది వచనాలను గుర్తు పెట్టుకోవటం కన్నా బాగా సులువు. శ్లోకాలలోని సౌష్ఠవపూరిత నిర్మాణం, చక్కటి ధార, వాటి అందమైన నడకల కారణంగా సులువుగా గుర్తుంటాయవి.
రెండవది, పూర్వకాలంలో కావ్య పఠనం సాధారణంగా అందరూ చేసేదే. కావ్యానికి గల ఆదరాన్ని సాధించకుండా యెంత గొప్ప విషయం గల గ్రంధమైనా ఆమోదం పొందటం కష్టంగా ఉంటుంది. పైగా యేశాస్త్రకారుడైనప్పటికీ స్వయంగా భాషాధ్యయనం చేసినవాడూ, కాస్తో కూస్తో మంచి కవిత్వం చెప్పగలవాడూ అయి ఉండటం సహజం. కాబట్టి తమ శాస్త్రవిషయాన్ని వీలయినంత అందమైన కవిత్వంగా చెప్పటం కూడా అవసరమే. ఇది కూడా గ్రంధానికి ప్రసిధ్ధి తేగలదు. అలాగని అన్ని శాస్త్రగ్రంధాలూ మంచి కవిత్వం చెప్పలేదనుకోండి. అది వేరే విషయం.
No comments:
Post a Comment
వ్యాఖ్యలకు అనుమతి అవసరం!